కాని కవిత్వం ఒక దీపం వెలిగించడం లాంటిది. ఒకసారి ఒక కాంతికిరణం ఈ లోకంలో ప్రభవించాక అగణ్య కాంతిసంవత్సరాల పాటు అదట్లా ప్రయాణిస్తోనే ఉంటుంది. ఎక్కడో, ఎవరో ఒక పాఠకుడు దాన్ని పట్టుకునేదాకా. అటువంటి సహృదయుడు ఉండితీరతాడన్న నమ్మకం ఉండబట్టే భవభూతి 'పృథ్వి విశాలం, కాలం అనంతం' అన్నాడు.
