సచ్చిదానందమూర్తి తత్త్వశాస్త్ర ఆచార్యుడు. జీవితకాలంపాటు విశ్వవిద్యాలయాల్లో తత్త్వశాస్త్రం బోధిస్తో ఉన్నారు. కాని ఆయన ఉద్యోగజీవితంలో ఉన్నప్పుడూ, ఉద్యోగ విరమణ తర్వాతా, మరీ ముఖ్యంగా తన చివరి సంవత్సరాల్లో మొదటి తరహా తాత్వికుడిగా జీవించారు. ఆయనలో అన్నిటికన్నా విశిష్టమైన అంశం అదే.
ముప్ఫై ఏళ్ళ తర్వాత
కాని కవిత్వం ఒక దీపం వెలిగించడం లాంటిది. ఒకసారి ఒక కాంతికిరణం ఈ లోకంలో ప్రభవించాక అగణ్య కాంతిసంవత్సరాల పాటు అదట్లా ప్రయాణిస్తోనే ఉంటుంది. ఎక్కడో, ఎవరో ఒక పాఠకుడు దాన్ని పట్టుకునేదాకా. అటువంటి సహృదయుడు ఉండితీరతాడన్న నమ్మకం ఉండబట్టే భవభూతి 'పృథ్వి విశాలం, కాలం అనంతం' అన్నాడు.
ఆధునిక ఇతిహాసం
అందుకని ఆ గీతానికి నా అనువాదం 'ఆత్మోత్సవ గీతం' పేరిట, ఇదుగో, ఇలా ఈ-బుక్ గా విడుదల చేస్తున్నాను. ఇది నా 47 వ పుస్తకం.
