కవియోగి

హిందువులూ, ముస్లిములూ తప్ప మనుషులు కనబడకుండా పోతున్న కాలం ఇది. ఇట్లాంటి కాలంలో ఖుస్రో, భితాయీ, గాలిబ్, మీర్ వంటి కవులు పదే పదే గుర్తుకు రావడం సహజం. వాళ్ళు హిందూ సంకేతాలకీ, ముస్లిం చిహ్నాలకీ అతీతమైన ఒక ప్రేమైక వదనం కోసం పరితపించారు. మనుషుల్ని ప్రేమించేవాళ్ళెవరైనా పంచుకోగలిగేది అటువంటి పరితాపమొక్కదాన్నే.

పాటలు పుట్టిన తావులు

జీవితసౌందర్యాన్ని మాటల్లోనూ, రంగుల్లోనూ పట్టుకోవడమెలానో కొంత సాధన చేసానుగాని, రాగాల్లో కనుగొనడమెట్లానో ఇంకా జాడతెలియడం లేదు. భగవత్కృప నా జీవితంలో సంగీత రూపంగా ఇంకా అనుభవంలోకి రావలసి ఉంది.

ఢిల్లీ పాఠశాలలు

ఒక సమాజంలో పాఠశాలలు పరివర్తన చెందాలంటే, అక్కడ రాజకీయనాయకులు, పాత్రికేయులు, తల్లిదండ్రులు, ఉపాధాయులు, ఎవరేనాకానీ, నలుగురు కలిసినప్పుడల్లా పాఠశాలల గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. ఒకరినుంచి ఒకరు ఉత్సాహం పొందుతుండాలి, ఒకరినొకరు అభినందించుకోవాలి. ఒకరినొకరు ముందుకు నడుపుకుంటూ ఉండాలి.