సుప్రసిద్ధ జపనీయ హైకూ కవి మత్సువొ బషొ (1644–1694) రాసిన అయిదు యాత్రాకథనాలకు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం. బషొ యాత్రలపైనా, ఈ అనువాదానికి చేపట్టిన పద్ధతులపైనా ఒక సమగ్రవ్యాసం కూడా ఇందులో పొందుపరిచారు.
సత్యమొక్కటే, దర్శనాలు వేరు గాంధీ, టాగోర్ సంవాదం
స్వాతంత్ర్యోద్యమసంగ్రామ కాలంలో దేశాన్ని జాగృతం చేసిన మహనీయుల్లో మహాత్మాగాంధి, రవీంద్రనాథ్ టాగోర్ ముందువరసలో నిలుస్తారు. గాంధీని టాగోర్ మహాత్మా అని సంబోధిస్తే, గాంధీ టాగోర్ ని గురుదేవ్ అని పిలిచేవారు. కాని, సహాయనిరాకరణోద్యమకాలంలో వారిద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. అదొక ఆసక్తికరమైన సంవాదంగా రూపుదిద్దుకుంది.ఆ సంవాదం కూడా జాతిని మరింత జాగృతం చెయ్యడానికే సహకరించింది.
హరిలాల్ గాంధీ మహాత్ముడి పెద్దకొడుకు జీవితకథ
హరిలాల్ గాంధీ మహాత్మాగాంధీ పెద్దకొడుకు. మొదట్లో గాంధీ అనుయాయుడిగా దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. కాని అనంతరకాలంలో గాంధీ అభిప్రాయాలతో విభేదించి ఆయన మీద ధిక్కారం ప్రకటించాడు. చివరికి విషాదాంతంగా పరిణమించిన ఆ జీవితగాథను గుజరాతీలో చందులాల్ భాగుభాయి దలాల్ ఎంతో సత్యసంధతతో రచించారు.
