వారికి నా కైమోడ్పు

ఆ అధికారుల్లో సుబ్రహ్మణ్యంగారిది చాలా ప్రత్యేకమైన స్థానం. కాకపోతే, తన ఉద్యోగ జీవితపు తొలిరోజుల్లో పనిచేసిన ఒక సంస్థలోని ఉపాధ్యాయుల పేర్లు గుర్తుపెట్టుకుని ఇన్నేళ్ళ తరువాత ఇలా వారి గురించి ఎవరు రాయగలుగుతారు

కొన్ని కలలు, కొన్ని మెలకువలు

వాడ్రేవు చినవీరభద్రుడు జిలా గిరిజన సంక్షేమాధికారిగా 1987 నుంచి 1995 దాకా విజయనగరం, విశాఖపట్టణం, కర్నూలు, అదిలాబాదుజిల్లాల్లో పనిచేసిన కాలంలో ప్రాథమికవిద్యను గిరిజనప్రాంతాల్లో సార్వత్రీకరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు. 1995 నుంచి 1997 మధ్యకాలంలో గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆ ప్రయత్నాలకొక సమగ్రరూపాన్ని సంతరించి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రమంతటా అమలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగించారు. ఆ అనుభవాల్లో ఆయన సాఫల్యవైఫల్యాలను వివరించే రచన 'కొన్ని కలలు, కొన్ని మెలకువలు.'