నా నీటిరంగుల చిత్రలేఖనం మీద పూజ్యులు గణేశ్వరరావుగారు నిన్న రాసిన మాటలు నాకెంతో సంతోషం కలిగించాయి. నా ఇరవయ్యేళ్ళ వయసులో నా కథలు చదివి కాళీపట్నం రామారావుగారు రాసిన ఉత్తరం నాకెంత స్ఫూర్తి కలిగించిందో, ఇప్పుడు ఈ మాటలు నాకంత ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నా సాధన కొనసాగించడానికి మళ్ళా కొత్తగా ఒక ప్రోద్బలం దొరికింది.
