సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారి గురించి విన్నానుగాని, ఒకటి రెండు కథలు మినహా, ఆయన రచనలేమీ నేను చదవలేదు. ఇప్పుడు తానా నవలలపోటీలో బహుమతి పొందిన ఆయన నవల 'ఒంటరి' చదువుదామనుకుంటూ ఉండగానే మిత్రులు గజేంద్రనాథ్ గారు హన్స్ ఇండియాలో తాను రాసిన వ్యాసం ఒకటి నాకు పంపించారు.