పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా మేఘసందేశ కావ్యం గురించి ఇది ఎనిమిదవ ప్రసంగం. ఇప్పటిదాకా 40 శ్లోకాలు, అంటే, కావ్యంలో మూడవవంతు పూర్తయింది. ఇవాళ 41-49 దాకా శ్లోకాల గురించి నా భావాలు పంచుకున్నాను. ఈ ప్రసంగం ఇక్కడ వినవచ్చు,
పుస్తక పరిచయం-28
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరంలో భాగంగా కాళిదాసు మేఘసందేశం పైన చేసిన ఏడవ ప్రసంగం. ఈ ప్రసంగంలో ప్రధానంగా 'పశ్చాదుచ్చైర్భుజతరువనం మండలేనాభిలీనః' అనే శ్లోకాన్ని వివరిస్తూ రసధ్వనిని దాటిన కాళిదాసు కవిత్వ లక్షణాల గురించి కొంత వివరంగా చర్చించాను.
పుస్తక పరిచయం-25
పుస్తక పరిచయం ప్రసంగపరంపరలో భాగంగా ఇది ఇరవై అయిదవ ప్రసంగం. మీ ఆదరణ వల్ల, ఆసక్తి వల్ల మాత్రమే ఇన్ని ప్రసంగాలు చెయ్యగలిగాను. అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మేఘసందేశం కావ్యం గురించిన పరిచయంలో భాగంగా నాలుగవ ప్రసంగం చేసాను. పూర్వమేఘంలోని 18-27 దాకా శ్లోకాల గురించి ఈరోజు ముచ్చటించుకున్నాం. ఈ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.
