ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా కూడా ఆ అనుభూతి నన్ను వెన్నంటే ఉంది. దేవాలయాల్లో కప్పే శేషవస్త్రంలాగా, ఆయన మా అమ్మ కూడా అయి నన్ను దగ్గరగా తీసుకున్న ఒక అనిర్వచనీయమైన అనుభూతి.
వేదన వెలుగుగా మారినవేళ-1
అక్కడ అడుగుపెడుతూనే ముందు స్ఫురించిన మాట, ఆమె దేవతగా మారిన కవయిత్రి అని. నేను కూడా కవినే కదా! కాని నేనెందుకు ఇంకా మనిషిగానే మిగిలిపోయాను? ఎంత ప్రయత్నించినా ఏదో ఒక వేళ దానవుణ్ణి కాకుండా ఉండలేకపోతున్నాను?
