ఆషాఢమేఘం-15

గాథాసప్తశతిలో కనిపించే స్త్రీపురుషప్రేమకీ తర్వాత రోజుల్లో కావ్యప్రపంచాన్ని పరిపాలించిన ప్రేమకీ మధ్య చాలా తేడా ఉంది. ప్రాకృత కవిత్వంలో కనిపించే ప్రేమ స్త్రీపురుషుల మధ్య సహజంగా వికసించే అత్యంత లౌకిక ప్రేమ, గ్రామీణ ప్రేమ. దేహాలనూ, మనసులనూ కలిపే ప్రేమ.

కొండవీడు-2

కొండవీడులో చరిత్ర శిథిలాలు ఒక చిన్న అంశం మాత్రమే. ఆ కొండకొమ్ముల మీద తేలాడే ఆ మబ్బులముందు, మేఘాలముందు మనకి చరిత్ర గుర్తుకు రాదు. మీరు శ్రీనాథుడి కవిత్వం చదివి ఉంటే, ఆ పద్యాల్లోని loftiness ఎక్కడిదో తెలియాలంటే మాత్రం ఒకసారైనా కొండవీడు పోయి రావాలి.

మొదటి స్వతంత్ర కావ్యం

అసలు తెలుగు సాహిత్యంలో పదిహేనో శతాబ్ది కవులందరిదీ ఒక ప్రత్యేకమైన అధ్యాయం. పిల్లలమర్రి పినవీరన, శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య- ఈ నలుగురూ పదిహేనో శతాబ్ది పొడుగునా శృంగార, వైరాగ్యాల మధ్య నలిగిపోయారు.