మందం మందం మధుర నినదైః

ఏమా అని తెరిచి చూద్దును కదా, గోదావరి గళం నుంచి ప్రవహిస్తున్నట్టు, మాష్టారి కంఠస్వరంలో కృష్ణకర్ణామృత శ్లోకాలు. అలానే వింటూ ఉండిపోయాను. సాయంకాల ప్రార్థన పూర్తయిందనిపించింది.

సంగీత రూపకం

గీతగోవిందం సంగీతం, కర్ణామృతం రూపకం మాత్రమే కాగా, శ్రీకృష్ణలీలా తరంగిణి సంగీత రూపకం కూడా. అంతేనా! జయదేవుడు సంస్కృతాన్ని సంగీతంగా మారిస్తే, నారాయణ తీర్థులు సంస్కృతాన్ని నృత్యంగా మార్చేసాడు. ఆయన వాక్కులో భాష ఆనందతాండవం చేసింది.