వీరవాక్యం

సిద్ధకవులు, నాథకవులు, చర్యాగీతకవులు, బుల్లేషా, కబీరు వంటి సూఫీకవుల గురించి తెలుసుకున్న ఎంతో కాలానికి గాని నా ఇంటిపెరడులోనే నెలకొన్న చింతామణిని గుర్తించలేకపోయాను. తక్కిన తెలుగు గీతకవులంతా ఒక ఎత్తూ, వీరబ్రహ్మం ఒక్కడూ ఒక ఎత్తు.

విశిష్ట ఉపాదానం

అక్కణ్ణుంచి పాశ్చాత్య విమర్శకులు ముందుకు పోలేకపోయారు. ఎందుకంటే, బోదిలేర్ ఆదిమపాపాన్ని నమ్మినంతగా, భగవదనుగ్రహాన్ని నమ్మినట్టుగా కనిపించలేదు వాళ్ళకి. కాని, పాశ్చాత్య విమర్శకులు ఎక్కడ ఆగిపోయారో, రాధాకృష్ణమూర్తిగారు అక్కణ్ణుంచి మొదలుపెట్టారు.