దేశదిమ్మరి తేనె తలపులు

మా రాజమండ్రి మిత్రుల జ్ఞాపకంగా వారందరి తరఫునా ఆ పుస్తకం నేనందుకున్నాను అనుకున్నాను. సుబ్బు, మహేశ్, సావిత్రిగారు, శరత్ బాబు, రామనాథం లతో పాటు ఏమైపోయాడో తెలియని గోపీచంద్ కూడా నిన్న రాత్రి నా తో పాటు అక్కడున్నారని గుర్తుపట్టాను.

చక్రాల వెంకట సుబ్బుమహేశ్వర్

మా మిత్రుడూ, నాకెంతో ఆత్మీయుడూ మహేష్ నిన్న రాత్రి చెన్నైలో ఈ లోకం వదిలిపెట్టివెళ్ళిపోయాడు. నిన్నసాయంకాలమే సురేష్ బాబు ఫోన్ చేసినప్పుడే నేనీ వార్త వినడానికి మానసికంగా సిద్ధపడిపోయాను. పొద్దున్నే కుప్పిలి పద్మ, కొప్పర్తి, వొమ్మి రమేష్.. రాజమండ్రి మిత్రులంతా ఫోన్ చేస్తూ ఉన్నారు.