రాజమండ్రి డైరీ, 1986

ఒకప్పుడు రాజమండ్రిలో సాహితీవేదిక అనే సాహితీబృందం ఉండేది. ఆ సంస్థ 1980 డిసెంబరు 25 న ఏర్పాటయింది. ఆ రోజుని గుర్తుపెట్టుకుని గతమూడేళ్ళుగా అప్పటి మిత్రులు డిసెంబరు 25 నాడు రాజమండ్రిలో కలుస్తూ ఉన్నారు. ఈ ఏడాది కూడా గౌతమీ గ్రంథాలయంలో మళ్ళా కలుసుకున్నారు. ఆ సందర్భంగా నా పుస్తకాలు రెండు ఆవిష్కరణకు నోచుకున్నాయి.

రాజమండ్రి డైరీ

ఇది నా 46 వ పుస్తకం. దీంతో, ఉత్తరాలు, నాటకం, నృత్యరూపకం ప్రక్రియలు తప్ప తక్కిన అన్ని సాహిత్యప్రక్రియల్లోనూ నా రచనలు వెలువడినట్టే.

కొత్తగోదావరి

కానీ ఈ కవికి కాలం గురించిన స్పృహ ఉంది. ఇప్పటి కాలం నలభయ్యేళ్ళ కిందటిలాగా లేదనీ, ఇది ‘గాజు ఆవహించిన కాలం’ అనీ అతడికి తెలుసు. ‘బొటనవేలు తప్ప శరీరమంతా నిరుపయోగమైపోయింద’ని కూడా తెలుసు. కానీ, ఆ సౌకుమార్యానికీ, ఆ ‘సరస్వతీ హ్రదపు జ్ఞాపకానికీ’ అతడు దూరం కాలేదు.