ప్రాచీన కాలంలో కవిత్వమంటే వర్ణన. ప్రధానంగా శబ్దాలతో చేసే వర్ణన. చిత్రలేఖకుల భాషలో చెప్పాలంటే వర్ణలేపనం. సంగీతకారుల భాషలో చెప్పాలంటే స్వరప్రస్తారం. కవి వర్ణన నెపంతో కొత్త భాషని తన శ్రోతలకి అందిస్తాడు. అది వాళ్ళకి కొత్త రెక్కలిచ్చినట్టు ఉంటుంది.
ఆషాఢ మేఘం-17
గాథాసప్తశతిలో కవయిత్రులు నన్నాపేస్తున్నారు. దాదాపు రెండువేల ఏళ్ళ కిందట కవిత్వం చెప్పిన ముగ్ధలూ, ప్రౌఢలూనూ. మమ్మల్ని నీ మిత్రులకి పరిచయం చెయ్యవా అని అడుగుతున్నారు.
