పునర్యానం-45

కానీ ఏ రచయితైనా ముందు తన కోసం తన రాసుకుంటాడు. తనలోని ఒక శ్రోతను ఉద్దేశించి తను చెప్పదలుచుకున్నది చెప్పుకుంటాడు. తనలోని శ్రోత కనుమరుగవుతూ బయట శ్రోతలు రావటం ఏ రచయితకీ, ఏ రచనకీ ఆరోగ్యకరం కాదు.

పురాణపాత్రలపై కొత్తవెలుగు

ఆ రోజు ఆయన తలపెట్టినట్టుగా రామాయణ మేళా చిత్రకూటంలో జరిగి ఉంటే తర్వాత రోజుల్లో అయోధ్యలో రామాలయం కట్టాలనే ఆ రాజకీయ తహతహకు అధికసంఖ్యాకుల మద్దతు లభించి ఉండేది కాదు కదా. రాముడుండేది రామకథాశ్రవణం జరిగేచోటతప్ప ఒక మసీదు కింద కాదని ప్రజలు సులభంగా గ్రహించి ఉండేవారు కదా.

శిలలలో మెడొనా

నిన్న సాయంకాలం ఆదిత్య మా ఆఫీసుకి వచ్చాడు. అతడు బాగులోంచి ఆగమగీతి బయటకు తీస్తుండగానే గుర్తొచ్చింది, బైరాగి (1925-79) పుట్టినరోజని. ముఫ్ఫై ఏళ్ళకిందట నేను బైరాగి కవిత్వాన్ని ఆరాధించినదానికన్నా అతడిప్పుడా కవిత్వాన్ని మరింత ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు.