కవులు పుట్టవచ్చు. కళాకారులు పుట్టవచ్చు. కానీ తన హృదయాన్నీ, రసననీ, మొత్తం జీవితాన్నీ పద్యానికి పల్లకిగా మార్చుకుని వూరేగించగలవాళ్ళు మాత్రం ఇక ముందు తరాల్లో పుడతారనుకోను. నాకు తెలిసి ఆ పద్య గంధర్వుల్లో చివరివాడు కవితాప్రసాద్.
వరమాలికా ప్రసాదుడు
మునిపల్లె రాజు ఒక శతాబ్ది సమానుడు. తెలుగునేలను ప్రభావితం చేసిన సాహిత్య, సాంఘిక, సాంస్కృతిక ప్రభావాలన్నింటికీ ఆయన వారసుడు. ఆయన రచనలు చదువుతూ ఉంటే మనం ఒక మనిషినో, ఒక కుటుంబాన్నో కాదు, వందేళ్ళ సామాజిక పరివర్తనని దగ్గరనుంచి చూస్తున్నట్టుగా ఉంటుంది.
లేనిదల్లా నువ్వు మాత్రమే
. కాని ఆయన తన కొలీగ్స్, తన పై అధికారులు, చివరికి మంత్రులూ, ఎమ్మెల్యేలూ కూడా తన సాహిత్యాన్నీ, పద్యాల్నీ, అవధానాల్నీ చూసి విని ఆనందించాలని కోరుకునేవాడు. వాన పడ్డప్పుడు రాళ్ళమీదా, ముళ్ళమీదా కూడా కురిసినట్టే, ఆయన సాహిత్యవర్షం హెచ్చుతగ్గులు చూసేది కాదు.
