ప్రాచీన కాలంలో కవిత్వమంటే వర్ణన. ప్రధానంగా శబ్దాలతో చేసే వర్ణన. చిత్రలేఖకుల భాషలో చెప్పాలంటే వర్ణలేపనం. సంగీతకారుల భాషలో చెప్పాలంటే స్వరప్రస్తారం. కవి వర్ణన నెపంతో కొత్త భాషని తన శ్రోతలకి అందిస్తాడు. అది వాళ్ళకి కొత్త రెక్కలిచ్చినట్టు ఉంటుంది.
ఆషాఢ మేఘం-20
పూర్వమేఘంలోని ఈ నలభై-యాభై పద్యాల్లో కాళిదాసు సంస్కృతకవిత్వాన్ని మొదటిసారిగా పొలాలమ్మట తిప్పాడు, అడవుల్లో, కొండల్లో విహరింపచేసాడు. గ్రామాల్లో రైతుల్ని, పథికవనితల్నీ పరిచయం చేసాడు.
ఆషాఢ మేఘం-19
కాని మేఘసందేశంలోని రసఝురి ఇక్కడే ఉంది. వసంతపవనంతో సందేశం పంపి ఉంటే అది తనకీ, తన భార్యకీ మాత్రమే సంబంధించిన శుభవార్త అయి ఉండేది. కాని ఋతుపవన మేఘం సమస్తలోకానికి కల్యాణప్రదం. ఆ మేఘాన్ని చూడగానే కడిమి పుష్పిస్తుంది. బలాకలు సంతోషంతో ఎగురుతాయి. ఆ మేఘగర్జన వినగానే పుట్టగొడుగులు నిద్రలోంచి మేల్కొంటాయి. రైతులు నాగళ్ళు భుజాన వేసుకుని వ్యవసాయం మొదలుపెడతారు.
