పెరిప్లస్ ఆఫ్ ద ఎరైత్రియన్ సీ

అటువంటి పుస్తకం ఉందనే తెలుగువారిలో చాలామందికి తెలియదు. అటువంటిది రెవెన్యూ శాఖలో తహశీల్దార్ గా పనిచేసి రిటైర్ అయిన మహమ్మద్ సిలార్ అనే పండితుడు తెలుగులోకి అనువదించడం, ఆ పుస్తకాన్ని లీలా అజయ్ గారు తాను స్వయంగా ప్రచురించి ఆవిష్కరణ సభ ఏర్పాటు చెయ్యడం నన్ను ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాయి.

కొండాపూర్ లో ఒక మధ్యాహ్నం

కాని, ఇక్కడి పరిస్థితి చూడండి. ఇప్పటికి రెండువేల ఏళ్ళకిందట తెలంగాణాలో ఒక పట్టణం ప్రముఖ్య వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. రోమ్ తో సాతవాహనులు నడిపిన వ్యాపారం లో ఆ పట్టణం ఎంత ప్రముఖ పాత్ర పోషించిందంటే అక్కడ ఒక రోమన్ సెటిల్ మెంట్ నే ఏర్పడిందని చరిత్రకారులు చెప్తున్నారు. కాని ఆ ప్రాంతాన్ని చూడటానికి ఇప్ఫుడెవరికీ ఆసక్తి లేదు.