ఇది వ్రత కథ కూడా. జీవనవ్రత కథ. దీనికి ఒక ఫలశ్రుతి కూడా ఉంది. పుస్తకం ముగించేక మీరు చెయ్యవలసింది నలుగురికి భోజనం పెట్టడం, నలుగురితో కలిసి విందు ఆరగించడం.
ఆంధ్రీకుటీరం చేస్తున్న విద్యావితరణ
ప్రపంచం రెండు విధాలుగా ఉంది. చుట్టూ ఉన్న వ్యవస్థల్ని విమర్శిస్తూ వుండే ప్రపంచమొకటి. 'చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూచోకుండా ప్రయత్నించి చిన్నదీపమేనా వెలిగించే' వాళ్ళ ప్రపంచం మరొకటి. కిరణ్ మధునాపంతుల ఈ రెండో తరహా ప్రపంచానికి చెందిన మనిషి.
