కొన్ని క్షణాల వైభవం

వాటిల్లో ఈ 'కొన్ని క్షణాల వైభవం' కథ కూడా ఒకటి. కథానిర్మాణంలో పతాకస్థాయిని చిత్రించడానికి ఒక ఉదాహరణగా ఈ కథని వివరించాలని అనుకున్నాను. ఆ వ్యాసాల్లో కొన్ని రాసాను, మిగిలినవి ఇంకా రాయవలసే ఉంది. ఇప్పుడు గూగీ వా థియాంగో (1938-2025) మన మధ్యనుంచి నిష్క్రమించాడు. ఆయనకు నివాళిగా ఈ కథని మీతో పంచుకుంటున్నాను

గూగి వా థియోంగో

గూగి వా థియోంగో (1938) కెన్యాకి చెందిన రచయిత. సమకాలిక ఆఫ్రికన్ రచయితల్లో అగ్రశ్రేణికి చెందినవాడు. కథ,నవల, నాటకం వంటి ప్రధాన ప్రక్రియల్లో చెప్పుకోదగ్గ రచనలు వెలువరించాడు. ముఖ్యంగా ఆఫ్రికన్ తెగల్లో ఒకటైన గికుయు తెగ వారి భాషలో ప్రస్తుతం రచనలు చేస్తున్నాడు.