బసవపురాణాన్ని పరిచయం చేస్తూ వచ్చిన ప్రసంగాల్లో పదవ ప్రసంగం. చివరి ప్రసంగం. తెలుగు కవిత్వాన్ని ప్రజలకు సన్నిహితంగా తీసుకురావడానికి సోమన ఎటువంటి కావ్యశైలిని నిర్మించుకున్నాడో ఆ విశేషాల్ని వివరించడానికి చేసిన ప్రయత్నం.' ఉరుతర గద్యపద్యోక్తులకంటే సరసమై పరగెడు జానుతెనుగు'లో సోమన బసవపురాణాన్ని ఎలా నిర్మించాడో కొన్ని ఉదాహరణలిస్తూ చేసిన ప్రసంగం.
ఆషాఢమేఘం-21
ప్రాచీన కాలంలో కవిత్వమంటే వర్ణన. ప్రధానంగా శబ్దాలతో చేసే వర్ణన. చిత్రలేఖకుల భాషలో చెప్పాలంటే వర్ణలేపనం. సంగీతకారుల భాషలో చెప్పాలంటే స్వరప్రస్తారం. కవి వర్ణన నెపంతో కొత్త భాషని తన శ్రోతలకి అందిస్తాడు. అది వాళ్ళకి కొత్త రెక్కలిచ్చినట్టు ఉంటుంది.
కాకరపర్రు
వి చూస్తే తప్ప చెప్పలేని మాట. నేను కారకపర్రు వెళ్ళినరోజున ఆ గాలినీ, ఆ ఆకాశాన్నీ చూసానుగానీ, దానికి తగ్గ మాట ఇప్పుడు స్ఫురిస్తున్నది. సమీర విధూతం అనే మాటవినగానే క్షాళిత సమీరం అనే మాట స్ఫురిస్తున్నది. ఆ రోజు ఆ గాలి ప్రక్షాళిత సమీరం, ఆ ఆకాశం శుభ్రధౌత గగనం.
