రెండురోజుల కిందట. పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళే హడావిడి. విజ్జి అన్నం వడ్డించింది. కాని నా మనసులో కర్ణపర్వంలో శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలే పదేపదే వినిపిస్తున్నాయి. ఘటోత్కచవధ అయిన తరువాత ఆయన సంతోషం ఆపుకోలేకపోయాడు.
భారతసావిత్రి
మొత్తానికి మహాభారతం చదవడం పూర్తిచేసేసాను. డా. తిప్పాభొట్ల రామకృష్ణమూర్తి, సూరం శ్రీనివాసులు చేసిన అనువాదం ఇంతదాకా తెలుగులో వచ్చిన వచన అనువాదాల్లో ప్రశస్తమైందనిపించింది. శ్రీ లలితా త్రిపుర సుందరీధార్మిక పరిషత్ గుంటూరు వారు ప్రచురించిన 20 సంపుటాలు (2010)మూలానికి పూర్తి విధేయంగా ఉండటంతో బాటు సరళమైన శైలి.
