శ్రీ లక్ష్మణమూర్తి

శ్రీ లక్ష్మణమూర్తిగారు ఇటీవల స్వర్గస్థులయ్యారన్న వార్త చాలా ఆలస్యంగా తెలిసింది. ఆయన్ని నేను ఒకే ఒక్కసారి కలుసుకున్నాను, అది కూడా ఇరవయ్యేళ్ళ కిందట. కానీ ఆ ఒక్క సమావేశమే ఆయనతో ఒక జీవితకాలం గుర్తుపెట్టుకునే సాహిత్యానుభవాన్నిచ్చింది. ఆ విశేషాలు అప్పట్లో తెలుగు ఇండియా టుడే లో 'సాలోచన' లో పంచుకున్నాను. ఆ తర్వాత ఆ వ్యాసం 'సోమయ్యకు నచ్చిన వ్యాసాలు' పుస్తకంలో పొందుపరిచాను. ఇప్పుడు ఆయనకు నివాళిగా ఆ వ్యాసాన్నిక్కడ మరోమారు మీతో పంచుకుంటున్నాను.

చెప్పకుండా వెళ్ళిపోయాడు

సుమనశ్రీ వెళ్ళిపోయాడంటే సాహిత్యం గురించో, కవిత్వం గురించో రాయకుండా ఇదంతా ఎందుకు రాస్తున్నాని అనిపిస్తోంది కదూ! ఎందుకు సాహిత్యం? కవిత్వం? ఎందుకు అన్నేళ్ళ పాటు అన్నేసి గంటల పాటు కవిత్వం గురించి మాట్లాడుకుంటూ గడపడం? ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు పక్కన లేకపోయాక నీ స్నేహాలకీ, నీ సాహిత్యానికీ ప్రయోజనమేముంది?