ఆ అధికారుల్లో సుబ్రహ్మణ్యంగారిది చాలా ప్రత్యేకమైన స్థానం. కాకపోతే, తన ఉద్యోగ జీవితపు తొలిరోజుల్లో పనిచేసిన ఒక సంస్థలోని ఉపాధ్యాయుల పేర్లు గుర్తుపెట్టుకుని ఇన్నేళ్ళ తరువాత ఇలా వారి గురించి ఎవరు రాయగలుగుతారు
మళ్ళా ఇన్నాళ్ళకి పార్వతీపురం దారుల్లో
1967-71 ప్రాంతాల్లో శ్రీకాకుళం గిరిజనప్రాంతాల్లో తలెత్తిన తిరుగుబాటు, అలజడీ పార్వతీపురం గిరిజన ప్రాంతాల్లోనే ప్రధానంగా సంభవించేయి. ఆ తర్వాత ఇరవయ్యేళ్ళ్ళకి, అంటే, 1987 లో నేను జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా ఉద్యోగంలో చేరినప్పుడు పార్వతీపురం గిరిజనప్రాంతాల్లోనే ట్రైనింగూ, మొదటి పోస్టింగూ కూడా. అక్కణ్ణుంచి అనూహ్యపరిస్థితుల్లో 1990 లో ఆ జిల్లా వదిలిపెట్టి వచ్చేసినదాకా,ఆ అడవుల్లో నేను తిరగని చోటులేదు, ఎక్కని కొండలేదు.
