అతడి జీవితంలో నిజంగా దుర్భరమైన అధ్యాయం అంటే ఇదే. అతడు తన తొలి కవిత్వం 1829 లో అచ్చువేసుకుంటే, ఆ తర్వాత ముప్ఫై ఏళ్ళకు పైగా అతడిరకా బానిసగానే జీవించవలసి రావడం. తాను బానిసగా జీవిస్తున్నాడు అనే చైతన్యం లేకపోయి ఉంటే, ఆ నరకం వేరు. కాని తాను బానిసగా జీవించవలసి వస్తూండటాన్ని తన మనసూ, బుద్ధీ కూడా అంగీకరించడం లేదని తెలిసాక కూడా ఆ జీవితమే జీవించవలసి రావడంలోని నరకం మన ఊహకి కూడా అందేది కాదు.
