ఆషాఢమేఘం-14

ఒక విమర్శకుడు రాసినట్టుగా, 473 మంది సంగం కవులున్నారంటే, 384 మంది గాహాకోశ కవులున్నారంటే, ఆ కాలాలు, ఆ సమాజాలు ఎంత రసనిష్యందితాలయి ఉండాలి!

ఆషాఢమేఘం-13

నిజమైన కవిత్వానికి ఎజెండా ఉండదు. బుచ్చిబాబు చెప్పినట్టుగా అది నీకు జీవితాన్ని జీవించదగ్గదిగా మారుస్తుంది అంతే. ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు నీ ముందు సరికొత్తగా ఆవిష్కరిస్తుంది. కాని ఆ శక్తి అనన్యసామాన్యమైన శక్తి. అందుకనే పూర్వకాలంలో మతాలూ, ఇప్పటికాలంలో రాజకీయాలూ కవుల్నీ, కవిత్వాల్నీ తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే చూస్తూ వచ్చాయి.

ఆషాఢమేఘం-12

కాని ప్రాచీన ప్రాకృత కవిత్వం చేతుల్లోకి రాగానే ఆ వానాకాలపు నేరేడు చెట్ల అడివి నా కిటికీ దగ్గరకు వచ్చినట్టనిపించింది. అంతదాకా నా జీవితంలో చదువుకుంటూ వచ్చిన ఆధునిక విమర్శ ఆ రసరమ్య ప్రాచీన ప్రపంచాన్ని నాకు తెలియకుండా దాచి ఉంచిందనీ, అప్పటికే నేనెంతో పోగొట్టుకున్నాననీ అనిపించింది.