కవిగా మాత్రమే కాదు, గాయకుడిగా కూడా గద్దర్ ది అద్వితీయమైన గళం. గానం. ఆ గొంతులోని జీర, ఆ అరుపులు, ఆ విరుపులు, మధ్యలో ఆ ఉరుములు, ఆ నొక్కులు- అవి అతడి పాటకు అద్దే ప్రత్యేకత మరొకరి గొంతులో మనం వినగలిగేది కాదు.
వంగపండుని చూసాకే అర్థమయింది
పాట చాలా చిత్రమైనది. ఒకరికి అది జయమాల, మరొకరికి ఉరితాడు. ఒకరినది అందలమెక్కిస్తుంది. పద్మశ్రీ, పద్మవిభూషణుల్ని చేస్తుంది. మరొకరిని ప్రవాసానికీ, కారాగారానికీ పంపిస్తుంది. కాని, శ్రోతల్ని మాత్రం ఒక్కలానే పరవశింపచేస్తుంది.
