ప్రాచీన భారతదేశ కథాచట్రాన్ని మధ్యయుగ భారతదేశానికి మధ్యయుగ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దినవారు జైనులు. జైనులు నిర్వహించిన ఈ మహోన్నత చారిత్రక సాహిత్య పాత్ర గురించి దురదృష్టవశాత్తూ ఈనాటి రచయితలకీ, పండితులకీ, పాఠకులకీ కూడా దాదాపుగా తెలియదనే చెప్పాలి. కాని జైనులే లేకపోతే, భారతీయ సాహిత్యం ఇలా ఉండి ఉండేదే కాదు.
కథలు ఎలా పయనించేయి-2
మనం మహాభారతాన్ని ఇతిహాసంగా లెక్కేస్తాం తప్ప కథాచట్రంగా లెక్కవెయ్యం. మధ్యయుగాల కథానిర్మాణం కథాచట్రపద్ధతిలో నడవడానికి కారణమైంది బృహత్కథ, పంచతంత్రం తప్ప మహాభారతం కాదు. ఎందుకని
