కృషీవలుడు

ఇప్పుడు కృషీవలుడు చదువుతూ ఉంటే ఎంతో కొత్తగానూ, తాజాగానూ, అప్పుడే కోసి గంపకెత్తిన కూరగాయల రాశిలానూ, దోసపండ్ల బుట్టలానూ కనిపిస్తున్నది.

దువ్వూరి రామిరెడ్డి

రామిరెడ్డిగారిని ప్రోత్సహించిన జేమ్స్ హెచ్ కజిన్స్ (1873-1956) మామూలు వ్యక్తి కాడు. ఆయన అప్పటికే పేరొందిన ఐరిష్ వక్త, నాటకకర్త. యేట్సు, జాయిస్ లకు మిత్రుడు. అనీబిసెంట్ ప్రోద్బలంలో భారతదేశానికి వచ్చాడు. దివ్యజ్ఞానసమాజంలో సభ్యుడు.