ప్రపంచబాంకు ప్రతి ఏటా వెలువరించే ప్రపంచ అభివృద్ధి నివేదిక 2018 వ సంవత్సరానికి వెలువడింది. 1978 నుంచీ వెలువరిస్తున్న ఈ నివేదికల పరంపరలో బాంకు విద్య గురించి మొదటిసారిగా వెలువరించిన నివేదిక ఇది. మారుతున్న ప్రపంచ సామాజిక-ఆర్థిక గతిని ఎప్పటికప్పుడు ఎంతో నిశితంగానూ, లోతుగానూ పట్టుకోవడమే కాక, ప్రపంచదేశాలకూ, రాజకీయ విధాననిర్ణయవేత్తలకూ మార్గదర్శకంగా ఉండే ప్రపంచబాంకు తన వార్షిక అభివృద్ధి నివేదికల్లో ఇంతదాకా విద్య గురించి మాట్లాడవలసినంతగా మాట్లాడకపోవడమే ఒక ఆశ్చర్యం.
ఉన్నత విద్యలో కొత్త ప్రయోగాలు
మౌలనా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివెర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక ఓరియెంటేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నాను. దేశవ్యాప్తంగా వివిధ విస్వవిద్యాలయాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చెరర్లు, ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల ప్రిన్సిపాళ్ళు సుమారు యాభై మందికి ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం.
21 వ శతాబ్దంలో విద్య
నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఇన్ స్టిట్యూట్స్ ఛైర్మనూ, మిత్రులు ప్రసన్నకుమార్ గారు, తమ సంస్థ వ్యవస్థాపకదినోత్సవంలో కీలక ప్రసంగం చెయ్యమని ఆహ్వానించేరు. నిన్న యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాదు లో జరిగిన ఆ సమావేశానికి ప్రసిద్ధ గాంధేయవాది, అసొసియేషన్ ఫర్ వాలంటరీ అసొసియేషన్స్ ఫర్ రూరల్ డవలప్ మెంట్( అవర్డ్) అధ్యక్షుడు పి.ఎం.త్రిపాఠి ముఖ్య అతిథి.
