వాన్ గో, గురజాడా

పదిరోజుల కిందట గణేశ్వర రావు గారు వాన్ గో చిత్రించిన 'పొద్దుతిరుగుడు పూలు' చిత్రాన్ని పరిచయం చేసినప్పుడు, ఒక మిత్రుడు, ఆ చిత్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందేటంత ప్రత్యేకత ఏమున్నదో తెలియడం లేదని రాసాడు. ఆ మాటలకి స్పందించి అక్కడే రెండు వాక్యాలు రాయాలనుకున్నాను, కానీ, నా ఆలోచనలు మరింత వివరంగా రాయాలనిపించింది.

చిత్రలేఖనం, వర్ణలేపనం

మనం చిత్రలేఖనం అని వ్యవహరించే కళలో నిజానికి రెండు విద్యలున్నాయి, డ్రాయింగూ, పెయింటింగూను. బొమ్మలు గియ్యడం,రంగులు వెయ్యడం.  ప్రాచీన చీనా చిత్రకారులూ, భారతీయ, పారశీక మీనియేచర్ చిత్రకారులూ ప్రధానంగా రేఖా చిత్రకారులు. యూరోప్ లో కూడా తొలితరం చిత్రకారులు రేఖాచిత్రకారులే. దాదాపుగా క్లాసిసిజం కాలం దాకా కూడా అంటే పందొమ్మిదో శతాబ్ది మొదటిరోజులదాకా కూడా రేఖకే ప్రాధాన్యం

చిత్రలేఖనమంటే నిశ్చలప్రయాణం

నిన్న నేను వేసిన ఇంకు చిత్రాన్ని షేర్ చేస్తూ సురేశ్ కొలిచాల గారు ఎంతో ప్రేమతో, ఆదరంతో నా గురించి నాలుగు మాటలు చెప్పారు. ఒక నదీగీతాన్ని తెలుగు చేసి అందరికీ అందించారు. ఆయన చూపించిన అభిమానానికి బదులుగాఏమివ్వగలను? మరికొన్ని మంచి భావాలు పంచుకోవడం తప్ప!