నన్ను వెన్నాడే కథలు-5

ఆ కథ చెహోవ్ కథాశిల్పానికి పరిపూర్ణమైన నమూనా. అందుకనే రష్యను సాహిత్యం మీద తాను చేస్తున్న ప్రసంగాల్లో భాగంగా చెహోవ్ గురించి చెప్పేటప్పుడు వ్లదిమీరు నబకొవు ఈ కథ గురించే చాలా వివరంగా విశ్లేషించాడు. ఈ కథ ఆధునిక కథాశిల్పానికి ఒక టెక్స్టుబుక్కు ఉదాహరణ.

ఇద్దరు మహారచయితలు

కానీ చాలా జీవితాలు పతాకకి చేరుకోకుండానే ముగిసిపోతాయి. మనుషులు మరణించేది, గొప్ప ఉద్రేకావస్థలో తీవ్ర స్థితికి చేరుకున్నాక కాదు, చాలా సార్లు, ఒక ఉత్తరం రాయడం మర్చిపోయి మరణిస్తారు. ఆర్కిటెక్చరంటూ ఏదీ లేదు. ఉన్నదంతా ఒక చిత్తుప్రతి, ఎన్నిసార్లు మూసినా సరిగ్గా మూసుకోని తలుపు.

దివ్యస్పర్శ

మన చుట్టూ ఉన్న సమాజంలో ఇటువంటి మాటలు మాట్లాడగలిగిన వారు ఎవరేనా ఉన్నారా? నిత్యం తన విశ్వాసాన్ని తాను బలపర్చుకోడానికే ప్రయత్నిస్తూనే ఉన్నాననీ, ఆ ప్రయాణంలో తన సందేహాలు తనని అడ్డగించలేవనీ చెప్పగలిగేవారున్నారా?