సాధారణంగా మనుషులు స్త్రీపట్లా, కవిత్వం పట్లా తొందరగా మాట తూలతారని భవభూతి అన్నాడని గుర్తు చేస్తూ, తన ప్రసంగసారాంశంగా ఆయన చెప్తున్నదేమిటంటే, గొప్ప కవిత్వాన్ని సమీపించడానికి, అనుభవమూ, మననమూ కావాలి తప్ప bookish knowledge కాదని. ఈ ప్రసంగమంతా విన్నాక నాకేమి అర్థమయిందంటే ఒక మహాకావ్యానికి కాలనియంత్రణ లేదని.
అంటున్నాడు తుకా-5
మొత్తం ప్రపంచమంతా దైవమే కావలసిందల్లా చిటికెడు ఉపదేశం మొదట నిన్ను నువ్వు నాశనం చేసుకో అప్పుడు నువ్వేమని బదులిస్తావు?
అంటున్నాడు తుకా-4
వైకుంఠం వదిలిపెట్టిమరీ వచ్చి ఇటుకమీద నిలబడ్డాడు తిన్నగా. భక్తపుండలీకుణ్ణి కలుసుకోడానికి జగజ్జ్యేష్ఠుడు వచ్చేసాడిక్కడికి.
