మొగలిపూలగాలి

నీళ్ళునింపుకున్న కడవల్లాంటి నల్లమబ్బులు నింగిలో కనబడగానే భారతీయకవులు లోనైన రసపారవశ్యంలో సంతోషం, దిగులు, ప్రేమించినవాళ్ళనుంచి ఎడబాటు, ఎడబాటు తీరుతుందన్న కోరిక-ఎన్నో భావాలు వ్యక్తం కావడానికి వాల్మీకి రామాయణంతోనే మొదలు.

రెండు ముల్లై కవితలు

ఇరవయ్యేళ్ళకిందట చైనా కవిత్వాన్ని మొదటిసారి చదివినప్పుడు చాలా ఏళ్ళే నేనో విభ్రాంత లోకంలో గడిపాను. కాని పదిపదిహేనేళ్ళ కిందట మొదటిసారి ఎ.కె.రామానుజన్ 'పొయెమ్స్ అఫ్ లవ్ అండ్ వార్ ' చదివినతరువాత చీనా కవిత్వంకన్నా ప్రాచీన కవిత్వం మన పక్కనే వికసించిందని తెలిసినప్పటినుంచీ ప్రాచీన తమిళ సంగం కవిత్వానికి నేను గాఢాభిమానిగా మారాను.

చుట్టూ, చెప్పలేనంత ఉల్లాసం

ఒకవైపు రంజాన్ ఉపవాసాలు, మరొకవైపు బోనాలు. పండగ సందడి లో తేలుతున్న నగరంలో స్నేహితుల రోజు. స్నేహమంటే జలాలుద్దీన్ రూమీ, షమ్షుద్దీన్ తబ్రీజీల మధ్య నడిచిన అనుబంధంలాగా ఉండాలి. ఒకరు మరొకరికి దర్పణంలాగా, అంటే ఎదుటివారిలో తను తప్ప మరేమీ కనిపించనంత తాదాత్మ్యం సాధ్యం కావాలి.