త్ర్యంబకం పర్యటన మీద రాసిన యాత్రావర్ణనలో (నేను తిరిగిన దారులు, 2011) సంత్ జ్ఞానేశ్వర్ గురించీ ఆయన అనుభవామృతం గురించీ నేను రాసినదానికీ, అక్కడ చేసిన రెండుమూడు అనువాదాలకీ గంగారెడ్డి సంత్ జ్ఞానేశ్వర్ కి ఒక జీవితకాల ఆరాధకుడిగామారిపోయాడు. ఆ తర్వాత ఆ మధ్య ఒక రోజు జ్ఞానేశ్వరి చదువుతున్నానని చెప్పాడు.
నిజమైన జీవితాశయం
భారతదేశానికి బుద్ధుడెలాగో, గ్రీసుకి సోక్రటీసెలాగో, చైనాకి కన్ ఫ్యూసియస్ ( క్రీ.పూ. 551-479) అలాగ. గత రెండువేల అయిదువందల చీనా చరిత్రమీదా, సంస్కృతిమీదా ఆయన ముద్ర అపారం.ఇరవయ్యవశతాబ్దిలో ఆయన భావజాలం మీద పెద్ద తిరుగుబాటు చెలరేగింది.
పాడిపంటలు పొంగిపొర్లే దారిలో
పన్నెండుమంది ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ (క్రీ.శ.9 వశతాబ్ది) రచించిన తిరుప్పావై భారతీయసాహిత్యంలోని అత్యంతవిలువైన కృతుల్లో ఒకటి. తదనంతరసాహిత్యాన్ని అపారంగా ప్రభావితం చేసిన రచన. అక్కమహాదేవి, మీరా, లల్ల, మొల్ల వంటి ప్రాచీనకవయిత్రులతో పాటు సరోజినీనాయుడు, తోరూదత్, మహాదేవీవర్మవంటి ఆధునిక కవయిత్రులదాకా ఎందరో భావుకులకూ, రసపిపాసులకూ, జీవితప్రేమికులకూ ఆండాళ్ దే ఒరవడి.
