ఇరవయ్యేళ్ళకిందట చైనా కవిత్వాన్ని మొదటిసారి చదివినప్పుడు చాలా ఏళ్ళే నేనో విభ్రాంత లోకంలో గడిపాను. కాని పదిపదిహేనేళ్ళ కిందట మొదటిసారి ఎ.కె.రామానుజన్ 'పొయెమ్స్ అఫ్ లవ్ అండ్ వార్ ' చదివినతరువాత చీనా కవిత్వంకన్నా ప్రాచీన కవిత్వం మన పక్కనే వికసించిందని తెలిసినప్పటినుంచీ ప్రాచీన తమిళ సంగం కవిత్వానికి నేను గాఢాభిమానిగా మారాను.
రామాయణ పర్వతశ్రేణి
మీకు కొండలంటే చాలా ఇష్టమల్లే ఉందనుకుంటాను అన్నారు గణేశ్వరావుగారు, నా 'కొండమీద అతిథి' పుస్తకం చూసి. 'అవును, మాది కొండ కింద పల్లె' అని ఒకింత గర్వంగానే చెప్పాను గాని, ఆ వెంటనే సిగ్గుపడ్డాను కూడా. నిజంగా కొండల్ని ప్రేమించవలసినంతగా ప్రేమిస్తున్నానా నేను?
సంగీతపు రెక్కలమీద యాత్ర
ఈస్టర్ ప్రభాతం. నిన్నటి వసంతవాన చల్లదనం ఇంకా గాల్లో కమ్మతెమ్మెరగా ప్రసరిస్తూనే ఉంది. 'చైత్రము లోన చినుకు పడాలని కోరేవు ' అన్నాడు కవి. వసంతకాల వాన నింగినీ నేలనీ కలిపే రంగుల వంతెన. ఇటువంటి వేళల్లోనే ప్రాచీనా చీనా కవులు తలపుకొస్తారు. కాని నా ఎదట . మొన్ననే అభిషేక్ ముజుందార్ కానుక చేసిన గీతాంజలి ఉంది.
