ఇప్పటి యువతీయువకులూ, కవులూ, కథకులూ ఎంతమంది గోర్కీని చదువుతున్నారో తెలియదుగానీ, మా తరందాకా గోర్కీని చదవడం తప్పనిసరిగా ఉండేది. ఇంకా చెప్పాలంటే నువ్వొక సాహిత్యబృందంతో కలిసి తిరగాలంటే గోర్కీని చదివి ఉండటం ఒక అలిఖిత సభ్యత్వ నిబంధనలాగా ఉండేది.
ప్రభాతసంగీతం
ఆ గాయకులు తాము గానం చేసిన రెండున్నర గంటల పాటూ అక్కడ అటువంటి ఒక వేడుకనే నడిపారనిపించింది. మనం పండగల్లో మట్టితో దేవతను రూపొందిస్తే వారు మన చుట్టూ ఉన్న గాల్లోంచి సంగీతదేవతను ఆవాహన చేసారు.
శరణార్థి
సమ్మెట ఉమాదేవి ఆదర్శ ఉపాధ్యాయులు. జీవితమంతా బడిపిల్లల్తో గడిపారు. ముఖ్యంగా మారుమూల గిరిజన తండాల్లో బాలబాలికలకి ఒక పూలతోవ చూపిస్తూ గడిపారు. ఫేస్ బుక్ లో తన వాల్ మీద నూరు కథల వరహాలు పేరిట తెలుగులో వచ్చిన కథల్లో తనకు నచ్చిన కథల్ని ఎంచుకుని తన గొంతులో మిత్రులకు వినిపిస్తూ ఉన్నారు. అందులో నూరవకథగా నా 'శరణార్థి' కథను వినిపించారు.
