కాని ఇప్పుడు ఈ ఉత్తరాలు చదివేక నాకు చాలా సంతోషంగానూ, ధైర్యంగానూ ఉంది. కవులు ఎప్పుడూ ఉంటారు, కాని కావలసింది సహృదయులు. వాళ్ళకి తన హృదయాన్నొక ఆశ్రయంగా మార్చగల తగుళ్ళ గోపాల్లాంటి సహృదయులు కనబడితే ఇదుగో, స్వర్ణయుగానికి స్వాగతం అనాలనిపిస్తుంది.
సృష్టిగర్భ: ఉపనిషత్కాంతి
దీర్ఘాసి విజయభాస్కర్ కవిగా, రచయితగా, నాటకకర్తగా, సమర్థుడైన అధికారిగా ఇప్పటికే తెలుగుప్రపంచానికి పరిచయం. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటి ఆయన ఈ స్థితికి చేరుకోవడమే ఒక జయగాథ, అతడు పుట్టిపెరిగిన ప్రాంతానికీ, ఆ కుటుంబాలకీ మాత్రమే కాదు, మనందరికీ కూడా. కానీ అతడు ఇంతదాకా అధిరోహించిన ఎత్తులు ఒక ఎత్తు. ఈ పుస్తకం ద్వారా చేపట్టిన ఆరోహణ మరొక ఎత్తు.
తెహ్ జీబ్
ఈ ఒక్క కథ అనే కాదు, దాదాపుగా చాలా కథలు నాకు పదేపదే ప్రేమ్ చంద్ ని గుర్తుకు తెస్తూ ఉన్నాయి. పుస్తకం చదవడం ముగించేక, 2013 లో ఆయన వెలువరించిన 'ఏక్ కహానీ కే తీన్ రంగ్' కి నేను రాసిన ముందుమాట మరోసారి తీసి చదివాను. ఆశ్చర్యంగా అప్పుడు కూడా నాకు ప్రేమ్ చంద్ గుర్తొస్తున్నాడనే రాసాను. అంటే నా అనుభూతి నిక్కమైనదేన్నమాట. నా epiphany స్థిరంగానే ఉందన్నమాట!
