వాజ్ పేయి కవిత

వాజ్ పేయి కవిత్వం ఒక రాజకీయవాది చేసే ప్రసంగంలాగా ఎక్కడా వినిపించదు. అది చాలా సన్నిహితంగా, ఒక సాధారణమానవుడు తన సందేహాల్నీ, సంఘర్షణనీ తనతోతాను సంభాషించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ సంభాషణలో ఒక సత్యసంధత ఉంది.

సర్వజ్ఞ వచనాలు

గురజాడలాగా సర్వజ్ఞుడు కూడా పాడిపంటలు పొంగిపొర్లే దేశాన్ని కోరుకున్నాడు. ఆయన కలగన్న స్వర్గం సరళం, ఐహికం, స్వాభావికం. సకాలంలో కురిసే వాన, చక్కగా పండే పొలం, మనసు కలిసిన ఇల్లాలు, తనతో అమరిక కుదిరిన బిడ్డలు, ఆదరంతో చేరవచ్చే ఇరుగుపొరుగు-ఇంతే ఆయన కోరుకున్న లోకం. ఆకలి వేస్తే దొరికే అన్నం, నెమ్మదిగా సాగే వేసవి, నిండువెన్నెల రాత్రి, ఇవే ఆయన కోరుకున్న భోగం

యాత్రా సాహిత్యం

తెలుగుసమాజం ఇప్పుడు అత్యంత ప్రాపంచిక సమాజం. మనుషులు వ్యక్తులుగానూ, సమాజంగానూ కూడా ఇంత వ్యాపారధోరణిలో కూరుకుపోయిన చోటు భారతదేశంలో నాకు మరెక్కడా కనిపించడంలేదు. ఈ కైదునుంచి తెలుగుజాతిని బయటపడేయాలంటే మహాయాత్రీకులు మరింతమంది పుట్టుకు రావలసి ఉంటుంది.