పెరిప్లస్ ఆఫ్ ద ఎరైత్రియన్ సీ

అటువంటి పుస్తకం ఉందనే తెలుగువారిలో చాలామందికి తెలియదు. అటువంటిది రెవెన్యూ శాఖలో తహశీల్దార్ గా పనిచేసి రిటైర్ అయిన మహమ్మద్ సిలార్ అనే పండితుడు తెలుగులోకి అనువదించడం, ఆ పుస్తకాన్ని లీలా అజయ్ గారు తాను స్వయంగా ప్రచురించి ఆవిష్కరణ సభ ఏర్పాటు చెయ్యడం నన్ను ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాయి.

ప్రపంచ కవితా దినోత్సవం

నినాదాలు, ప్రచారాలు, అనుకరణలు, పొగడ్తలు, తెగడ్తలు కవిత్వంగా చెలామణి అవడం మొదలుపెట్టాయంటే ఆ జాతి ధ్వంసం అవుతున్నట్టు. నిరలంకారంగా, సూటిగా పలికే ఒక చక్కనిమాటకి శ్రోతల హృదయాలు స్పందిస్తున్నాయంటే ఆ జాతికి మంచిరోజులు వచ్చినట్టు.

ఇష్ట కవిత్వం

ఎందుకంటే సాహిత్య చరిత్ర చదివి ఆధునిక పాశ్చాత్య కవిత్వం లేకపోతే ఆధునిక తెలుగు కవిత్వం లేదనుకుంటూ ఉన్నాం. కాని యూరపియన్ దుఃఖానికి మరీ అంతలా ఋణపడకుండానే తెలుగులో ఇంత అద్భుతమైన కవిత్వం వికసించిందని ఈ పుస్తకం మనకి స్పష్టంగా గుర్తుచేస్తోంది.