ఆ నదుల కలయికని ఇప్పుడంటే నా కళ్ళముందు చూస్తున్నాను గాని, అసలు ఈ దేశంలో ప్రతి ఒక్క భావుకుడూ ఒక త్రివేణీ సంగమమే కదా. తిరిగి వారణాసికి ప్రయాణిస్తున్నంతసేపూ భారతీయ సాహిత్యంలో ఆ నదీప్రశంసలే నా మనసులో మెదుల్తూ ఉన్నాయి. ఆకాశంలో చంద్రుడు కూడా అలహాబాదునుంచి వారణాసిదాకా మాతో పాటే ప్రయాణిస్తూ ఉన్నాడు
నా కాశీయాత్ర-2
మంగళవాద్యాల, శంఖతాళాల మధ్య బిగ్గరగా పాడుతున్న హారతిగీతాల మధ్య దేదీప్యమానమైన దీపాల వెలుగు, రంగురంగుల దీపాలు, ఆ దీపకాంతిలో లక్షలాది రంగుల్లో యాత్రీకులు, వారి వదనాలన్నీ నీటిమీద కలిసిపోతున్న నీటిరంగుల్లాగా అలుక్కుపోయి ఆ ఒడ్డంతా ఒక ఇంద్రచాపం పరిచినట్టుగా అనిపించింది.
నా కాశీయాత్ర-1
కాశీ సూక్ష్మరూప భారతదేశం. ఈ దేశంలో ఎన్ని వైరుధ్యాలున్నాయో అన్నీ అక్కడ కనిపిస్తాయి. అక్కడ శౌచం గురించిన ఆరాటం ఎంత ఉందో అంత అశౌచం ఉంది, జీవితం అక్కడ ఎంత ఉరుకులు పరుగులు పెడుతుందో, అంత తీరికదనముంది. మరింత బాగా బతకాలని మనుషులు అక్కడ ఎన్ని మొక్కులు మొక్కుకుంటారో, అక్కడ చనిపోవాలని కూడా అంతగా కోరుకుంటారు.
