మామిడిచెట్టు ఏడాదిలో ఆరునెలలు నిద్రపోతుంది. ఆరునెలలు పరిపూర్ణంగా జీవిస్తుంది. పూర్తి ఉత్సాహంతో, మహావైభవంతో జీవిస్తుంది. మాఘమాసంలో పూత, ఫాల్గుణంలో పిందె, వైశాఖంలో రసాలూరే ఫలాలు-ఇంత త్వరత్వరగా పుష్పించి, ఫలించే ఈ వైనం ఒక సంస్కృతకవికి ప్రేమవ్యవహారంలాగా అనిపించింది
స్వాగతం మేఘమా!
ఎన్నేళ్ళయింది మృగశిర కార్తె అడుగుపెట్టిన రోజునే తొలకరి జల్లు పలకరించి! జల్లు కూడా కాదు, సముద్రమే ఆకాశం మీంచి ప్రయాణిస్తున్నట్టుంది! ఋతుపవనమేఘమిట్లా అడుగుపెట్టవలసిననాడే అడుగుపెట్టడం కన్నా భారతీయ ఆకాశానికీ, భారతీయ సుక్షేత్రానికీ శుభవార్త మరేముంటుంది! అంతకన్నా సత్యం, శివం, సౌందర్యమేముంటుది!
జెండా కొండ
ఆదివాసులకి కొండ ఒక అఖండ జీవపదార్థమని నా మిత్రుడూ, గిరిజన సాహిత్యవేత్తా డా.శివరామకృష్ణ రాసాడు. 'పండితారాధ్య చరిత్ర''లో 'పర్వత ప్రకరణం'లో శ్రీశైలం గురించి రాస్తూ, 'అకృతాత్ములకు శిలా నికరమై తోచు/సుకృతాత్ములకు లింగ నికరమై తోచు 'అన్నాడు పాల్కురికి సోమన.
