అందుకని ఈసారి మురళి పిలిచినప్పుడు మూగెన్నను చూడటం కన్నా బయ్యన్నను చూడటం మీదనే నాకు ఎక్కువ ఆసక్తి ఉండింది. దేవుడూ, మనిషీ కలిసి అంతదగ్గరగా గడపడం ఒక్క ఆదిమసమాజాల్లోనే సాధ్యమనిపిస్తుంది.
ఆయన కృపాదృష్టికి అడ్డులేదు
ఆ మందిరప్రాంగణంలో అడుగుపెట్టగానే చల్లగానూ, సేదతీర్చేదిగానూ అనిపించింది. ఆ మందిరంలో ఆయన మూర్తి ఒక పల్లెటూరి పెద్దమనిషిలాగా మన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మనం చెప్పబోయేది వినటానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది.
సాహిత్య పురస్కారం
మీకు రాయడానికీ, చదవడానికీ ఇంత సమయం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు మిత్రులు. నేనేం చెప్తానంటే, సాహిత్యమే లేకపోతే నా ఉద్యోగ జీవితంలో నేను ఉన్మాదిని అయిపోయి ఉండేవాణ్ణని.
