43 ఎకరాల జొన్నపంట

నిన్న పొద్దున్న పాణ్యం చెంచుకాలనీలో, కాలం ఆ జాతిలోనూ, కుటుంబాల్లోనూ తెచ్చిన మార్పులేవైవుంటాయా అని ఆలోచిస్తూ, ఒక ఇంట్లో అడుగుపెట్టాను.ఆ ఇల్లు, ఒకే ఒక్క గది,అక్కడొక మూల నాలుగైదు మూటలు కనిపిస్తే అవేమిటని అడిగాను. నాతో పాటు దగ్గరుండి అన్నీ వివరిస్తున్న సర్పంచ్ మేకల సుబ్బరాయుడు అవి బియ్యం మూటలని చెప్పాడు.

బయ్యన్న

ఇతిహాస సంకలన సమితి వారు గిరిజన సంస్కృతి మీద రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన నేషనల్ వర్క్ షాప్ లో పాల్గోటానికి శ్రీశైలం వెళ్ళాను. నిన్న తిరిగివస్తూంటే ఒక చెంచురైతు తన పొలంలో మొక్కజొన్న పంట పండిదనీ, తొలికంకులు తమ దేవుడు బయ్యన్నకు నైవేద్యంగా పెడుతున్నాననీ, ఆ పూజకి నన్ను కూడా రమ్మనీ అడిగాడు.

అక్షరబ్రహ్మ

శ్రీకాకుళం జిల్లా సవరసమాజంలో గత ఇరవయ్యేళ్ళుగా పాదుకొంటున్న అక్షరబ్రహ్మ ఉద్యమం గురించి తెలుసుకోవాలన్న కోరిక నాకు చాలా బలంగా ఉండిందిగానీ, ఇంతదాకా ఆ అవకాశం కలగలేదు. అందుకని రెండురోజులకిందట శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐ.టి.డి.ఏ కి వెళ్ళినప్పుడు, దగ్గరలో ఏదైనా ఒక సవరగూడలో అక్షరబ్రహ్మ కార్యక్రమం చూడాలని ఉందనగానే సహాయ ప్రాజెక్టు అధికారి నాగోరావు నన్ను నౌగడ గ్రామానికి తీసుకువెళ్ళాడు.