ఆన్ లైన్లూ, డిజిటల్ పరికరాలూ, పుస్తకాలూ, వర్కు బుక్కులూ ఒక ఉపాధ్యాయుడికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని కరోనా మనకి పూర్తిగా రుజువు చేసింది. నువ్వేమీ చెయ్యకపోయినా పర్వాలేదు. పిల్లవాడూ, నువ్వూ తరగతిగదిలో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నా కూడా అదే గొప్ప అభ్యసన కార్యక్రమం.
కవి సమ్రాట్
ఎల్.బి.శ్రీరాం విశ్వనాథ సత్యనారాయణగా సవిత్ సి చంద్ర అనే ఒక యువకుడు రాసి, దర్శకత్వం వహించిన ఆ చలనచిత్రం నిడివి యాభై నిమిషాలే గాని, చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్నీ హత్తుకుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపూ నా కళ్ళు కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నాయి.
వెన్నెల తడి
కాని ఇంట్లో సోఫాలో కూచుని ఆ సినిమా చూస్తున్నంతసేపూ బయట రెండెడ్ల బళ్ళు ఆగిఉన్నాయనీ, ఎడ్లు నెమ్మదిగా ఎండుగడ్డిపోచల్ని నెమరేసుకుంటున్నాయనీ, వాటిమీద మూడవజాము వెన్నెల రాలుతూ ఉందనీ అనిపిస్తూనే ఉంది. సినిమా అయిపోగానే ఆ ఎడ్లబండిమీద తిరిగి ఆ వెన్నెల రాత్రి అడవి దారిన మా ఊరు వెళ్ళిపోతానని అనుకుంటూ ఉన్నాను.
