అసలు ముందు ఆ ముఖచిత్రం దగ్గరే నేను చాలాసేపు ఆగిపోయాను. ఎంత రొమాంటిక్ గా ఉంది ఆ ఫొటో! లేపాక్షి శిల్పమంటపంలో కూచుని స్కెచ్ బుక్కు తెరిచిపెట్టుకుని ఒక బొమ్మ గియ్యడానికి ఉద్యుక్తుడవుతూ తన ఎదట ఉన్న శిల్పాన్ని పరికిస్తున్న్న ఆ చిత్రకారుణ్ణి చూసి ఏ కళాకారుడు మోహపడడు కనుక!
నా హీరోల్లో ఆయన కూడా ఉన్నారు
శీలావీర్రాజు గారు వేసిన బొమ్మలు చూస్తే మనకి ఈ విషయమే అర్థమవుతుంది. ఆయన చిత్రలేఖనంలో సమాజం, మనుషులు, దైనందిన జీవితం, సకలవృత్తులూ కనిపిస్తాయిగానీ, బయటి ప్రపంచంలో వాటిచుట్టు హోరుమంటో వినిపించే నాయిస్ ఆ బొమ్మల్లో కనిపించదు.
సౌందర్య సృష్టికర్త
అలా చూసినప్పుడు ట్రెవర్ ఛాంబర్లేను తన తరానికీ, తన తర్వాతి తరాలకీ కూడా సంతోషాన్నివ్వగల కొన్ని సౌందర్యశకలాల్ని సృష్టిస్తూ వచ్చాడని అర్థమవుతుంది. అతడు చిత్రించిన ప్రతి కాన్వాసులోనూ, ప్రతి కాగితం మీదా కాంతిని అద్దుకుంటూ పోయేడు. ఆ బొమ్మల్ని ఎవరు చూసినా అన్నిటికన్నా ముందు వాళ్ళు ఆ కాంతి తమమీద వర్షిస్తున్న అనుభూతికి లోనవుతారు.
