వారిద్దరి ప్రసంగాలూ విన్నాక, ఇవి నన్ను వెన్నాడే కథలు మాత్రమే కాదు, అందర్నీ వెన్నాడే కథలు కూడా అని అర్థమయింది. ..
సుమేరుశిఖరం మీంచి సూర్యోదయం
రాజేంద్ర ప్రసాద్ తాడికొండలో నా సహాధ్యాయి. ఆయన 1992 లోనో, 1993 లోనో పొఖారా వెళ్ళినప్పుడు సూర్యోదయ దృశ్యాన్ని చూసి ఇంగ్లిషులో ఒక కవిత రాసి నాకు పంపించాడు. నేను దాన్ని వెంటనే తెలుగు చెయ్యకుండా ఉండలేకపోయాను. ఆ అనువాదాన్ని 1993 లో అనుకుంటాను, ఆంధ్రజ్యోతి వారపత్రిక ప్రచురించింది. ఆ కవిత, ఇక నాకు దొరకదు అనుకున్నదాన్ని, నాసరరెడ్డినో మరెవరో నాకు పంపించారు. దాన్నిట్లా మీతో పంచుకుంటున్నాను.
