కథల సముద్రం ఆవిష్కరణ

గత ఆరేడేళ్ళుగా కథలమీదా, కథకులమీదా, నవలల మీదా నేను రాస్తూ వచ్చిన వ్యాసాల్ని కథల సముద్రం పేరిట సంకలనం చేసి ఈ-బుక్కుగా మీతో పంచుకున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు ఆ ఈ-బుక్కును ఎన్నెలపిట్ట ప్రచురణసంస్థ తరఫున శెషు కొర్లపాటి పుస్తకంగా తీసుకొచ్చేరు. ఈ రోజు బషీర్ బాగు ప్రెస్సు క్లబ్బులో జరిగిన రావిశాస్త్రి పురస్కార ప్రదాన సభలో ఈ పుస్తకాన్ని మహమ్మద్ ఖదీరు బాబు ఆవిష్కరించేరు. పుస్తకాన్ని డా.కొర్రపాటి ఆదిత్య అద్భుతంగా పరిచయం చేసారు.

పుస్తక పరిచయం-29

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా మేఘసందేశ కావ్యం గురించి ఇది ఎనిమిదవ ప్రసంగం. ఇప్పటిదాకా 40 శ్లోకాలు, అంటే, కావ్యంలో మూడవవంతు పూర్తయింది. ఇవాళ 41-49 దాకా శ్లోకాల గురించి నా భావాలు పంచుకున్నాను. ఈ ప్రసంగం ఇక్కడ వినవచ్చు,