ఈ కవితలు బాలాజీ శిశుహృదయంతో రాసాడు కాబట్టే ఇందులో అధికభాగం కవితలు, అమ్మ గురించీ, తన పిల్లల అమ్మ గురించీ, తనకి అమ్మగా మారిన తన పిల్లల గురించీ ఉండటంలో ఆశ్చర్యం లేదు. స్త్రీల గురించీ, తనని కడుపులో పెట్టుకుని చూసుకున్న తన తల్లి, సహచరి, కూతురుల గురించి కవి మాట్లాడినప్పుడల్లా మన హృదయంలో కూడా ఒక తంత్రి మృదుమధురంగా మోగడం మనకి వినబడుతుంది.
